
సినిమాలు

జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా లద్దాఖ్ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ ఎల్జీగా ఉన్న మనోజ్ సిన్హా సెలవులో ఉండటంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నిర్ణయం తీసుకున్నారు. మనోజ్ సిన్హా తిరిగి బాధ్యతలు స్వీకరించే వరకు సక్సేనా జమ్మూకశ్మీర్ ఎల్జీగా విధులు నిర్వహించనున్నారు.
అదే సమయంలో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా సక్సేనా తన ప్రస్తుత బాధ్యతలను కొనసాగించనున్నారు. దీంతో ఆయన ఒకేసారి జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జమ్మూకశ్మీర్ పరిపాలనా వ్యవహారాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు కేంద్రం ఈ తాత్కాలిక ఏర్పాటును చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!