

అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అమెరికా విజయం సాధించిన వెంటనే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోతాయని ఆయన అన్నారు. అమెరికాలో పెట్రోల్ ధరలు గ్యాలన్కు మూడు డాలర్లకు, ఆ తర్వాత రెండు డాలర్ల కంటే దిగువకు చేరుకోవచ్చని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకుండా చూస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
మరోవైపు, అమెరికా హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ ఇంధన వనరులపై అమెరికా దాడికి పాల్పడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ చమురు, గ్యాస్ వ్యవస్థలతో పాటు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా ఇంధన సంస్థలు కూడా తమ ప్రతీకార చర్యలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ ఆస్తులపై దాడి జరిగితే అమెరికా ఆస్తులపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!