
న్యూస్

ఓపెన్ ఏఐ విడుదల చేసిన నివేదికలో, కృత్రిమ మేధస్సు పెరుగుతున్న ఈ కాలంలో ప్రభుత్వాలు ఎలా నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపై సూచనలు ఇచ్చింది. ఏఐ వల్ల వచ్చే లాభాలు కొద్దిమందికే కాకుండా అందరికీ చేరేలా చూడాలని చెప్పింది. అలాగే సమాజం భద్రంగా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఈ నివేదికలో ఉద్యోగుల విషయానికీ ప్రాముఖ్యత ఇచ్చింది. నాలుగు రోజుల పని విధానం, జీతం తగ్గకుండా సెలవులు పెంచడం, ఉద్యోగులకు మంచి సదుపాయాలు కల్పించడం వంటి సూచనలు చేసింది. అలాగే పన్నుల విషయంలో కూడా మార్పులు అవసరమని చెప్పింది. ఏఐ వల్ల ఉద్యోగాల్లో మార్పులు వస్తున్న నేపథ్యంలో, ఆరోగ్యం, విద్య, సేవల రంగాల్లో కొత్త అవకాశాలు కల్పించాలని సూచించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!