
రాజకీయాలు

కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వేళ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఏఐ వల్ల సృష్టించబడే సంపద, జ్ఞానం, ఆర్థిక విలువలు కొద్దిమంది లేదా కొద్ది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతమైతే అది సమాజానికి తీవ్రమైన సవాళ్లను తీసుకురాగలదని ఆయన హెచ్చరించారు.
ఉద్యోగాలు కోల్పోవడం మాత్రమే కాకుండా, ఆర్థిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఏఐ అభివృద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చూడాల్సిన అవసరం ఉందని, లేకపోతే సాంకేతిక పురోగతి కొత్త రకాల అసమానతలకు దారితీయవచ్చని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!