

భారత రక్షణ తయారీ రంగం ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి అనుగుణంగా రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.78 లక్షల కోట్లకు చేరుకోగా, రూ.38 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినట్లు హైదరాబాద్లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) నిర్వహించిన రక్షణ రంగ ఎంఎస్ఎంఈల సదస్సులో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు, రక్షణ రంగ ప్రముఖులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని దేశ రక్షణ తయారీ రంగంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని వివరించారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7,000కు పైగా రక్షణ రంగ ఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, తెలంగాణలోనే దాదాపు 1,700 సంస్థలు ఉన్నాయని వెల్లడించారు. రక్షణ, ఏరోస్పేస్, డ్రోన్ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రక్షణ పార్కులు, అత్యాధునిక కామన్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తోందని అధికారులు తెలిపారు. మిధాని సీఎండీ ఎస్వీఎస్ నారాయణమూర్తి మాట్లాడుతూ, ఇస్రో, డీఆర్డీఓ అవసరాల కోసం 500 రకాల ప్రత్యేక అల్లాయ్స్ తయారు చేస్తున్నామని, సంస్థ కొనుగోళ్లలో సగానికి పైగా ఎంఎస్ఎంఈల నుంచే సేకరిస్తున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!