

‘సిగ్మా’ సినిమా ప్రమోషన్స్లో మేకర్స్ జోరు పెంచారు. యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రమోషన్స్లో పాల్గొన్న ఫరియా.. బోనాల సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్పై స్పందించింది. ఈ విషయంపై తాను సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని ఇప్పటికే వెల్లడించానని చెప్పింది. సోషల్ మీడియాపై తనకు పెద్దగా అభిప్రాయం లేదని, అది ఒక వేదిక మాత్రమేనని, ఎవరెవరు ఎలా ఉపయోగించుకుంటారో దాన్ని బట్టి దాని స్వరూపం ఉంటుందని తెలిపింది.
ప్రస్తుతం 2026లో ఉన్నప్పటికీ కొందరి ఆలోచనా విధానం ఇప్పటికీ పాతకాలంలోనే ఉందని ఫరియా వ్యాఖ్యానించింది. పాత సంప్రదాయాల నుంచి కొన్ని అభిప్రాయాలను తీసుకోవచ్చని, అయితే తన ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుందని చెప్పింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా చురుకుగా పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేయడంతో, ఫరియా దీనిపై స్పందిస్తూ భావోద్వేగ వీడియోను కూడా విడుదల చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!