

సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతూ ఇప్పుడు కంపెనీలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) హెచ్చరించింది. ‘బాస్ స్కామ్’ పేరుతో జరుగుతున్న ఈ మోసంలో సీఈవోలు లేదా ఇతర ఉన్నతాధికారుల పేర్లను ఉపయోగించి ఉద్యోగులను మభ్యపెడుతున్నారు. అత్యవసరంగా డబ్బులు బదిలీ చేయాలని లేదా రహస్య సమాచారాన్ని అందించాలని కోరుతూ ఉద్యోగులను మోసం చేసి భారీ మొత్తాలను కాజేస్తున్నారు.
ఈ మోసంలో భాగంగా సైబర్ నేరగాళ్లు ముందుగా సీఈవోలు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని ఆర్బీఐ వంటి సంస్థల పేరుతో ఫేక్ మెసేజ్లు లేదా ఈ-మెయిళ్లు పంపిస్తారు. వాటిలోని హానికర ఫైళ్లను ఓపెన్ చేసిన వెంటనే మాల్వేర్ సిస్టమ్లోకి ప్రవేశించి అధికారిక కమ్యూనికేషన్ వ్యవస్థలను హ్యాక్ చేస్తుంది. అనంతరం ఫైనాన్స్ టీమ్కు నకిలీ ఆదేశాలు పంపి నిధుల బదిలీకి ప్రయత్నిస్తారు. ఇలాంటి మోసాల నుంచి రక్షణ కోసం ప్రతి ఆర్థిక లావాదేవీని నేరుగా ధృవీకరించుకోవాలని, తెలియని ఫైళ్లను డౌన్లోడ్ చేయకూడదని ఐ4సీ సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!