

వాట్సప్లో ఇప్పటికే యూపీఐ పేమెంట్స్ సౌకర్యం అందుబాటులో ఉండగా, ఇప్పుడు యుటిలిటీ బిల్లుల చెల్లింపులను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇకపై కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లులతో పాటు ఫాస్టాగ్ రీచార్జ్, బీమా ప్రీమియం, క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్ ఈఎంఐలు వంటి పలు చెల్లింపులను వాట్సప్లోనే చేసుకోవచ్చు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ నెట్వర్క్ ద్వారా ఈ సేవ పనిచేస్తుంది. వివిధ కేటగిరీల్లోని వేలాది బిల్లర్లకు ఈ సదుపాయం మద్దతు ఇస్తోంది.
వాట్సప్ ద్వారా బిల్లు చెల్లించాలంటే ముందుగా యాప్ను ఓపెన్ చేసి పైభాగంలో కనిపించే రూపీ ఐకాన్పై క్లిక్ చేయాలి. అనంతరం బిల్ పేమెంట్ ఆప్షన్ను ఎంచుకుని, చెల్లించాల్సిన బిల్లును సెలెక్ట్ చేసి బిల్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత యూపీఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు చేసే అవకాశం ఉంది. గతంలో చెల్లించిన బిల్లులతో పాటు రాబోయే బిల్లులను కూడా చెక్ చేసుకునే సదుపాయం ఉండనుంది. ఈ ఫీచర్ను భారత్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!