

కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా భవిష్యత్తులో భారీగా ఉద్యోగాలు కోల్పోతామనే ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, గ్లీన్ సీఈఓ అరవింద్ జైన్ భిన్నమైన, సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ నిర్వహించిన సమ్మిట్లో మాట్లాడుతూ, ఏఐ ఎప్పటికీ మానవ సిబ్బందిని భర్తీ చేయదని, బదులుగా వారి పనితీరు మరియు సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. ఉద్యోగాల భర్తీపై చర్చలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ నష్టాలు కనిపించడం లేదని స్పష్టం చేశారు.
అరవింద్ జైన్ ప్రకారం, ఏఐ ఉద్యోగులకు కో-పైలట్లా పని చేస్తూ రొటీన్ పనులను నిర్వహిస్తుంది. దీంతో మానవులు సృజనాత్మకత, విశ్లేషణ, సమస్యల పరిష్కారం వంటి ముఖ్య అంశాలపై దృష్టి పెట్టగలుగుతారు. అయితే ఆయన అభిప్రాయాలు డారియో అమోడీ, జేమీ డిమోన్, జిమ్ ఫార్లీ వంటి దిగ్గజాల హెచ్చరికలకు విరుద్ధంగా ఉన్నాయి. వారు భవిష్యత్తులో వైట్-కాలర్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!