
క్రీడలు

జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఘటనను పంచుకున్నారు. ఓ కస్టమర్ తమ మైక్రోసాఫ్ట్ లైసెన్స్ రెన్యూవల్ సందర్భంగా సంస్థ అకస్మాత్తుగా ధరను పెంచిందని తనతో చెప్పారని ఆయన వెల్లడించారు. అనంతరం ప్రత్యామ్నాయంగా జోహో ఆఫీస్ సూట్ను పరిశీలిస్తున్నామని కస్టమర్ పేర్కొనగానే, మైక్రోసాఫ్ట్ తన ఆఫర్ను పూర్తిగా మార్చి రెన్యూవల్ ధరపై ఏకంగా 90 శాతం డిస్కౌంట్ ఇచ్చిందని శ్రీధర్ వెంబు తెలిపారు.
ఆ కస్టమర్ గతంలో జోహో ఉత్పత్తులను ఉపయోగించిన అనుభవం కూడా ఉందని ఆయన చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చివరకు జోహో ఉత్పత్తులను కొనుగోలు చేయకపోయినా, జోహో పేరు ప్రస్తావించడం వల్లే పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అయిందని ఆ కస్టమర్ తనకు కృతజ్ఞతలు తెలిపారని శ్రీధర్ వెంబు వెల్లడించారు. అయితే, ఆ కస్టమర్ వ్యక్తిగత వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!