

భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు భారీ ఊపునివ్వడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధమైంది. 2026 నాటికి దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అధికారికంగా ధృవీకరించారు. ఇది భారతదేశంలో మైక్రోసాఫ్ట్ చేపట్టనున్న అత్యంత వ్యూహాత్మక ప్రాజెక్ట్గా నిలవనుంది. ప్రస్తుతం అజూర్ క్లౌడ్ సేవలకు భారీ డిమాండ్ ఉండటంతో పాటు, నెలకు 30 డాలర్ల ధర కలిగిన ‘కోపైలట్ 365 ఏఐ అసిస్టెంట్’ వినియోగం కూడా వేగంగా పెరుగుతోందని ఆయన తెలిపారు.
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్లలో భారత్ అగ్రగామిగా కొనసాగుతోంది. విస్తృతమైన ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య, నైపుణ్యం కలిగిన సాంకేతిక ప్రతిభతో మైక్రోసాఫ్ట్ తన ఏఐ వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తోంది. గూగుల్, అమెజాన్ వంటి ప్రత్యర్థి సంస్థలు కూడా భారత మార్కెట్లో విస్తరణకు పోటీ పడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని భారత్లో పెట్టనున్నట్లు ప్రకటించగా, ఇది 2025లో ప్రకటించిన 3 బిలియన్ డాలర్ల పెట్టుబడికి అదనంగా ఉండటం విశేషం. ఈ పెట్టుబడిలో ముఖ్య భాగం హైదరాబాద్ డేటా సెంటర్ అభివృద్ధికి వినియోగించనున్నారు. ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని, నిర్దేశిత కాలానికి ముందే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చందోక్ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!