
గాసిప్స్

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఇవాళ కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. వడోదరలోని కోటాంబి బీసీఏ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లోకి ప్రవేశించి, ఇప్పటికే లీగ్ దశలో టాప్లో నిలిచి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తుది పోరులో తలపడుతుంది.
లీగ్ దశ చివరి మ్యాచ్లో యూపీ వారియర్స్పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, జెమిమా రోడ్రిగ్స్ నాయకత్వంలో మంచి ఊపు మీద ఉంది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ కూడా ఫైనల్ ఆశలతో ఈ మ్యాచ్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఒకే మ్యాచ్లో ఫైనల్ టికెట్ నిర్ణయమవుతుండటంతో ఈ ఎలిమినేటర్ పోరు ఉత్కంఠభరితంగా మారనుంది.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!