
బిజినెస్

డబ్ల్యూపీఎల్ (Women’s Premier League) విజేతలుగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళల జట్టుకు భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విజయం ఆనందాన్ని ప్రతిబింబించే జట్టు ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఆయన, మరోసారి ఆర్సీబీ చాంపియన్స్గా నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఆర్సీబీ జెండాను గర్వంగా ఎగరవేసిన ఈ విజయం ప్రతి ఒక్కరికి గర్వపడదగినదని విరాట్ కోహ్లీ అన్నారు. జట్టు కెప్టెన్ స్మృతి మంధానతో పాటు మొత్తం స్క్వాడ్, మేనేజ్మెంట్ టీమ్ను ప్రశంసిస్తూ, ఈ ఘన విజయం పూర్తిగా అర్హతతో సాధించారని అభినందించారు. అభిమానుల ప్రేమను ఆస్వాదిస్తూ ఈ విజయ క్షణాలను గుర్తుండిపోయేలా జరుపుకోవాలని సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!