
రాజకీయాలు

భారత్-ఎ జట్టు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ శ్రీలంక-ఎతో జరిగిన త్రిదేశాల సిరీస్ ఫైనల్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే అతడు 29 బంతుల్లో 94 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండగా, 324.13 పరుగుల వేగంతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
వన్డే స్థాయి దేశీయ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ శతకం సాధించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కేవలం 11 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి శ్రీలంక మాజీ ఆటగాడు కౌశల్ వీరరత్నే పేరిట ఉన్న 12 బంతుల రికార్డును అధిగమించాడు. 5 ఫోర్లు, 5 సిక్సర్లతోనే తొలి 50 పరుగులు పూర్తి చేసిన వైభవ్ ఒక్క పరుగు కూడా పరిగెత్తకుండా ఈ ఘనత సాధించాడు. గత మ్యాచ్ల్లో వచ్చిన విమర్శలకు ఫైనల్లో తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!