

టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించాడు. భారత జట్టు తరఫున ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమించాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో అర్షదీప్ ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్లో సికందర్ రజా, ర్యాన్ బర్ల్, టోనీ మున్యోంగాలను ఔట్ చేసిన అర్షదీప్ మూడు కీలక వికెట్లు తీశాడు. దీంతో టీ20 ప్రపంచకప్లలో అతని మొత్తం వికెట్ల సంఖ్య 35కి చేరింది. ఇప్పటివరకు 33 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న బుమ్రాను అధిగమించి అర్షదీప్ భారత్ తరఫున టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ (32) మూడో స్థానంలో ఉండగా, హార్దిక్ పాండ్యా (29), రవీంద్ర జడేజా (22) తదుపరి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో కూడా అర్ష్దీప్ 5 మ్యాచ్లలో 8 వికెట్లు తీసి వరుణ్ చక్రవర్తి (11) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!