

పోటీ ప్రపంచకప్ 2026 లో టీమ్ఇండియాకు అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయడం దాదాపు ఖరారైంది. నవీ ముంబయి వేదికగా బుధవారం జరిగిన టీమ్ఇండియా–దక్షిణాఫ్రికా టీ 20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఓపెనర్గా బరిలోకి దిగి తన సత్తా చాటాడు. కేవలం 20 బంతుల్లో రెండు ఫోర్లు, ఏడు సిక్స్లతో 53 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ప్రదర్శనతో జట్టులో తన స్థానం మరింత బలపరుచుకున్నాడు. మరోవైపు సంజు శాంసన్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్, ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో తిరిగి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. న్యూజిలాండ్తో జరిగిన టీ 20 సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో 215 పరుగులు చేసి రెండో అత్యధిక రన్గెటర్గా నిలిచాడు. రాయ్పూర్లో 76, తిరువనంతపురంలో 43 బంతుల్లో 103 పరుగులతో సూపర్ సెంచరీ సాధించాడు. తాజా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 32 స్థానాలు ఎగబాకి 32 వ ర్యాంక్కు చేరాడు. ఈ నెల 7 నుంచి భారత్, శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్ కప్లో ఇషాన్ రాణిస్తే, టీమ్ఇండియాలో అతడి స్థానం శాశ్వతమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!