

2026 టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలో భారత జట్టు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆదివారం అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 187 పరుగులు చేయగా, ఛేదనలో టీమ్ ఇండియా కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. ఈ భారీ ఓటమి కారణంగా భారత జట్టు నెట్ రన్ రేట్ (NRR) -3.800 కి పడిపోయింది, ఇది పాయింట్ల పట్టికలో భారత్ను చివరి స్థానానికి నెట్టివేసింది.
ప్రస్తుతం భారత సెమీఫైనల్ అవకాశాలు డైలమాలో పడ్డాయి. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ తన తదుపరి రెండు మ్యాచ్లలో ( 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్తో) కచ్చితంగా విజయం సాధించాలి. కేవలం గెలవడమే కాకుండా, రన్ రేట్ను మెరుగుపరుచుకోవడానికి భారీ తేడాతో గెలవడం చాలా ముఖ్యం. ఒకవేళ భారత్ ఈ రెండు మ్యాచ్లు గెలిస్తే 4 పాయింట్లు సాధిస్తుంది. అదే సమయంలో సౌతాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్లలోనూ గెలిస్తే, భారత్ నేరుగా సెమీస్కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇతర జట్లు కూడా 4 పాయింట్లతో సమంగా నిలిస్తే, రన్ రేట్ కీలకంగా మారుతుంది. ఏది ఏమైనా, డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న భారత్ ముందుకు సాగాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ను నాకౌట్గా భావించి ఆడాల్సి ఉంటుంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!