
న్యూస్

టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్థాన్ మ్యాచ్కు వర్షం ముప్పు ఏర్పడింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం పరిసర ప్రాంతమైన ఖెట్టరామ ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు గంటలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తాజా వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.
మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, అదే సమయానికి వర్షం పడే అవకాశం ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడితే మ్యాచ్ పూర్తి స్థాయిలో నిర్వహించే ప్రయత్నం జరుగుతుందని అధికారులు తెలిపారు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజ్ పోరు వర్షం ప్రభావంతో ఎలా కొనసాగుతుందో చూడాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!