
సినిమాలు

రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కు అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యత లభించింది. ఆమెను బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్ల కమిషన్ ఛైర్పర్సన్గా 2026–29 కాలానికి ఎన్నిక చేశారు. ఈ బాధ్యతతో పాటు బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగానూ ఆమె వ్యవహరిస్తారు.
ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ, ఎంతో బాధ్యతతో ఈ కొత్త పాత్రను స్వీకరిస్తున్నాను. అథ్లెట్ల కమిషన్ ఛైర్పర్సన్గా అథ్లెట్ల హక్కులు, అవసరాల కోసం నిలబడతాను. అథ్లెట్లు మరియు పాలకుల మధ్య వారధిలా పని చేస్తాను అని చెప్పారు.
ఇదిలా ఉండగా, సింధు 2020 నుంచి బీడబ్ల్యూఎఫ్ ఇంటిగ్రిటీ అంబాసిడర్గా కూడా సేవలందిస్తున్నారు. క్రీడల్లో నైతిక విలువలు, పారదర్శకత పెంపొందించడంలో ఆమె పాత్ర కీలకంగా కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!