

2026 టీ20 ప్రపంచకప్ను భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న , పాకిస్థాన్ జట్టు భారత్తో ఫిబ్రవరి 15 న జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరించనుందని అధికారికంగా ప్రకటించింది. పాక్ ప్రభుత్వం తమ జట్టుకు టోర్నమెంట్లో పాల్గొనడానికి అనుమతించినప్పటికీ, భారత్తో మ్యాచ్లో పాల్గోనందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటన పాకిస్థాన్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెలువడింది.
బహిష్కరణకు ప్రధాన కారణంగా భద్రతా సమస్యలు, దౌత్య ఉద్రిక్తతలు మరియు బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ నిర్ణయానికి నిరసన అని చూపిస్తున్నారు. ఫలితంగా, పాకిస్థాన్ మ్యాచ్ ఆడకపోతే భారత్కు నేరుగా రెండు పాయింట్లు లభిస్తాయి, పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు దెబ్బతింటాయి. అంతేకాక, ఐసీసీ ఆంక్షలు, ఆర్థిక నష్టం మరియు బ్రాడ్కాస్టింగ్ ఆదాయం లోనూ కొంత నష్టమవుతుంది. పాకిస్థాన్ జట్టు ఫిబ్రవరి 2 న కొలంబోకు బయలుదేరాల్సి ఉంది, ఐసీసీ చివరి నిర్ణయం ఏమవుతుందో వేచి చూడాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!