

ప్రపంచ ర్యాలీ చాంపియన్షిప్ (డబ్ల్యూఆర్సీ3)లో హైదరాబాద్కు చెందిన రేసర్ నవీన్ పులిగిళ్ల, కో-డ్రైవర్ మూసా షరీఫ్ జోడీ మరోసారి సత్తా చాటింది. పరాగ్వేలో జరిగిన ర్యాలీ డెల్ పరాగ్వేలో ఈ జంట మూడో స్థానంలో నిలిచింది. డ్యూరాన్ రేసింగ్ తరఫున ఫోర్డ్ ఫియస్టా ర్యాలీ3 కారులో బరిలోకి దిగిన వీరు 357.64 కిలోమీటర్ల మేర సాగిన 22 కఠినమైన గ్రావెల్ స్పెషల్ స్టేజ్లను 5 గంటల 10 నిమిషాల 54.9 సెకన్లలో పూర్తి చేశారు.
రేసులో ఆరంభంలో ఇబ్బందులు ఎదురైనా నవీన్-మూసా జోడీ పట్టుదలతో పుంజుకుని పోడియం సాధించింది. దీంతో డబ్ల్యూఆర్సీ3లో వరుసగా మూడో పోడియం ఫినిష్ను నమోదు చేసింది. సౌదీ అరేబియా ర్యాలీలో రెండో స్థానం, సఫారీ ర్యాలీ కెన్యాలో మూడో స్థానం తర్వాత తాజాగా పరాగ్వేలోనూ మూడో స్థానాన్ని దక్కించుకుంది. తదుపరి డబ్ల్యూఆర్సీ రౌండ్లో భాగంగా ఈ నెల 10 నుంచి చిలీలో జరిగే ర్యాలీలోనూ ఈ జంట బరిలోకి దిగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!