
టెక్నాలజీ

ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కేరళం ముఖ్యమంత్రి సతీశన్ను కలిశారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. రొనాల్డోకు కేరళంలో భారీగా అభిమానులు ఉన్నారని ఎల్మాతో సతీశన్ చెప్పారు. తాను కూడా రొనాల్డో అభిమానినేనని వెల్లడించారు. దీంతో ఈ భేటీ ఫుట్బాల్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
కేరళం ప్రజలు రొనాల్డోపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాన్ని తప్పకుండా తన సోదరుడికి తెలియజేస్తానని ఎల్మా తెలిపారు. ఈ సందర్భంగా సీఎం సతీశన్తో కలిసి ఫొటో దిగాలని ఆమె కోరడం ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యమంత్రి, రొనాల్డో సోదరి మధ్య జరిగిన ఈ భేటీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేరళంలోని రొనాల్డో అభిమానులు ఈ వీడియోను ఆసక్తిగా షేర్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!