

ఐపీఎల్ 2026లో వరుసగా ఆరు ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 9 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మిచెల్ మార్ష్ 56 బంతుల్లో 111 పరుగులతో చెలరేగిపోగా, పూరన్ మరియు రిషభ్ పంత్ కీలక పరుగులు జోడించారు. దీంతో లఖ్నవూ 209/3 భారీ స్కోరు నమోదు చేసింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆర్సీబీ లక్ష్యాన్ని 213 పరుగులకు మార్చారు.
ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ డకౌట్ కాగా, రజత్ పాటీదార్ 61 పరుగులతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. టిమ్ డేవిడ్ కూడా వేగంగా ఆడినా, ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు తీసి మ్యాచ్ను లఖ్నవూ వైపు తిప్పేశాడు. షాబాజ్ అహ్మద్ కీలక వికెట్లు పడగొట్టడంతో ఆర్సీబీ 203/6కే పరిమితమైంది. ఈ విజయంతో లఖ్నవూ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!