
బిజినెస్

మహిళల కబడ్డీ ప్రపంచకప్లో భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్లో చైనీస్ తైపీ జట్టును 35–28 తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. భారత మహిళల జట్టు అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వేదికపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది.
ఆట ప్రారంభం నుంచే భారత్ దూకుడు ప్రదర్శించింది. రైడ్స్, డిఫెన్స్లో సమర్ధంగా ఆడి మ్యాచ్పై పట్టును కోల్పోకుండా చివరి నిమిషం వరకు ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ విజయం దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఆనందాన్ని నింపింది.




















కామెంట్స్ (1)
వరుసగా రెండో టైటిల్ గర్వకారణం