

ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగియడంతో ప్లేఆఫ్స్కు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టిక, నెట్ రన్రేట్ పరంగా చూస్తే ఆర్సీబీ, గుజరాత్ జట్లు కాస్త బలంగా కనిపిస్తున్నప్పటికీ, మిగతా రెండు జట్లను తక్కువ అంచనా వేయలేం. ప్లేఆఫ్స్లో ప్రతి మ్యాచ్ కీలకమైందిగా మారనుంది.
ఇక నుంచి పాయింట్ల పట్టికకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. గెలిస్తేనే ముందుకు వెళ్లే పరిస్థితి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ నాలుగు జట్లలో ఏ జట్టు టైటిల్ గెలిచినా అది వారికి రెండో ఐపీఎల్ కప్పు అవుతుంది. గతేడాది తొలి టైటిల్ గెలిచిన ఆర్సీబీ మరోసారి చరిత్ర సృష్టించాలని చూస్తుండగా, గుజరాత్ టైటాన్స్ రెండో కప్పు కోసం సిద్ధమైంది. 2016 తర్వాత మరో టైటిల్ కోసం ఎస్ఆర్హెచ్ పోరాడుతుండగా, 2008 తర్వాత రాజస్థాన్ రాయల్స్ మళ్లీ కప్పు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!