
జనరల్

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక ఆసియా ఛాంపియన్షిప్లో మణిపూర్కు చెందిన అరియా పాంగంబమ్ స్వర్ణ పతకం సాధించారు. సీనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో అద్భుత ప్రదర్శనతో ఆమె ఈ ఘనతను అందుకున్నారు. ఈ టోర్నీలో భారత్కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి.
ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా అరియా పాంగంబమ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. గత టోర్నీలో ఇదే స్థానానికి పరిమితమైన ఆమె, ఆగస్టు 7న అద్భుత ప్రదర్శనతో సత్తాచాటి ఆసియా ఛాంపియన్గా అవతరించారు. ఆమె విజయం భారత ఏరోబిక్ జిమ్నాస్టిక్స్కు కొత్త ఉత్సాహాన్ని అందించింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!