

బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా మహిళల జట్టు భారత్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 38.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 217 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. బెత్ మూనీ 79 బంతుల్లో 76 పరుగులతో అద్భుతంగా రాణించగా, అలీసా హీలీ 70 బంతుల్లో 50 పరుగులు చేసి కీలక పాత్ర పోషించింది. అన్నాబెల్ సదర్లాండ్ 48 పరుగులతో నాటౌట్గా నిలిచింది.
భారత్ బ్యాటింగ్లో స్మృతి మంధాన (58), హర్మన్ప్రీత్ కౌర్ (53) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. కాశ్వీ గౌతమ్ 43 పరుగులతో హాఫ్ సెంచరీకి చేరువలో ఆగిపోయింది. మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రిచా ఘోష్ 23 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లీ గార్డనర్ మూడు వికెట్లు తీసి మెరిసగా, మేగాన్ షుట్ రెండు వికెట్లు సాధించింది. డార్సీ బ్రౌన్, అలానా కింగ్, తహ్లియా మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. భారత బౌలర్లలో శ్రీచరణి రెండు వికెట్లు తీసుకోగా, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో వికెట్ సాధించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!