
రాజకీయాలు

ఆసియా కప్లో భారత్తో జరిగిన మ్యాచ్లో షఫాలీ వర్మకు సెండ్ఆఫ్ ఇచ్చిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. షఫాలీని క్యాచ్ పట్టి ఔట్ చేసిన అనంతరం ఫాతిమా పెవిలియన్ వైపు సైగ చేసింది.
ఈ సైగ బ్యాటర్ ఔటైన తర్వాత ఆగ్రహంగా స్పందించేలా ప్రేరేపించే అవకాశం ఉందని ఐసీసీ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఫాతిమాపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. భారత్-పాకిస్థాన్ వంటి హై-వోల్టేజ్ మ్యాచ్లో చోటుచేసుకున్న ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!