
జనరల్

2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కొత్త ఫార్మాట్తో మరింత ఆసక్తికరంగా మారనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొననున్నాయి. లీగ్ దశలో జట్లను రెండు గ్రూపులుగా విభజించనుండగా, ప్రతి గ్రూపులో ఏడు జట్లు ఉంటాయి. తమ గ్రూపులోని ఇతర జట్లతో తలపడిన అనంతరం అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి.
లీగ్ దశ ముగిసిన తర్వాత సూపర్ సిక్స్ దశ ప్రారంభమవుతుంది. ప్రతి గ్రూప్ నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్కు చేరుకుంటాయి. ఈ దశలో జరిగే మ్యాచ్లు టోర్నీ భవిష్యత్తును నిర్ణయించేలా కీలకంగా ఉండనున్నాయి. పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చడంతో పాటు అభివృద్ధి చెందుతున్న క్రికెట్ దేశాలకు కూడా ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఫార్మాట్ను రూపొందించినట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!