

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారత్–పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ పునరుద్ధరణకు కీలక చర్యలు చేపడుతోంది. ఈ నెల 30, 31 తేదీల్లో అహ్మదాబాద్లో జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశాల్లో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. అంతకుముందు 21వ తేదీన జరిగే ముఖ్య కార్యనిర్వహణ అధికారుల వర్చువల్ సమావేశంలో కూడా ఈ ప్రతిపాదనపై చర్చ జరగనుంది. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో ఆశలు పెరుగుతున్నాయి.
టెస్ట్ క్రికెట్కు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో టోర్నమెంట్ను తొమ్మిది జట్ల నుంచి పన్నెండు జట్లకు విస్తరించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. దీనివల్ల జింబాబ్వే, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రణాళిక అమలైతే భవిష్యత్తులో భారత్, పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరిగే అవకాశం ఉంది. 2007-08 తర్వాత ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరగకపోవడంతో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. చిన్న క్రికెట్ బోర్డుల ఖర్చులను తగ్గించేందుకు ఒక్క మ్యాచ్ టెస్ట్ సిరీస్ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!