

భారతదేశంలో కోట్లాది మంది ఫుట్బాల్ అభిమానులు ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 మీడియా మరియు బ్రాడ్కాస్టింగ్ హక్కుల వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడింది. టెలికాస్ట్ హక్కులపై జరిగిన చర్చలు విజయవంతంగా పూర్తయ్యాయని, వచ్చే వారంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మాజీ జనరల్ సెక్రటరీ షాజీ ప్రభాకరన్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, ఫ్యాన్స్ ఎలాంటి అంతరాయం లేకుండా వరల్డ్ కప్ను ఆస్వాదించవచ్చని తెలిపారు.
ఫిఫా మొదటగా భారతీయ బ్రాడ్కాస్టర్ల నుంచి సుమారు 100 మిలియన్ డాలర్లు డిమాండ్ చేయగా, తరువాత దాన్ని 35 మిలియన్ డాలర్లకు తగ్గించినప్పటికీ ఒప్పందం ఆలస్యమైంది. అర్ధరాత్రి మ్యాచ్లు, ప్రకటన ఆదాయం తగ్గే అవకాశం వంటి కారణాలతో కంపెనీలు వెనక్కి తగ్గాయి. ప్రసార భారతి రేసు నుంచి తప్పుకోగా, ప్రస్తుతం జీ నెట్వర్క్ హక్కులను దక్కించుకునే రేసులో ముందంజలో ఉన్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!