

ఓటర్ల జాబితాలో మీ పేరు కొనసాగాలంటే వెంటనే అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు (EFలు) సమర్పించేందుకు జూలై 14 తుది గడువు. ఈలోగా పూర్తిగా నింపిన ఫారాలను బూత్ స్థాయి అధికారులకు (BLO) అందజేయకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేకపోయే అవకాశం ఉంది. ఫారం అందని వారు అధికారిక ఓటర్ల సేవల పోర్టల్ లేదా ECINET యాప్ ద్వారా డౌన్లోడ్ చేసి ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు.
ఫారంలో పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, EPIC నంబర్ (అందుబాటులో ఉంటే), తాజా పాస్పోర్ట్ సైజు ఫొటో వంటి వివరాలను నమోదు చేసి BLOకు అందజేయాలి. సమర్పించిన అనంతరం BLO ఇచ్చే సంతకంతో కూడిన రసీదును తప్పనిసరిగా భద్రపరుచుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 4.14 కోట్ల మందికి పైగా ఓటర్లకు ఫారాల పంపిణీ పూర్తికాగా, ఇంకా సుమారు 1.27 కోట్ల ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉంది. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం వేగంగా చర్యలు చేపడుతోంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!