

పల్లెకెలెలో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసి టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత శతకంతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఫర్హాన్ (63) అర్ధశతకంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. డాసన్ (3 వికెట్లు), ఒవర్టన్, ఆర్చర్ తలా రెండు వికెట్లు తీసి పాక్ను నియంత్రించారు. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడినా, బ్రూక్ (100; 51 బంతులు) ఒంటరి పోరాటంతో జట్టును విజయానికి దగ్గర చేశాడు.
సామ్ కరన్, జాక్స్తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన బ్రూక్ ఇన్నింగ్స్కు బలం చేకూర్చాడు. చివరి ఓవర్లలో పాకిస్థాన్ బౌలర్లు ఉత్కంఠ రేపినా, ఆఖరి ఓవర్లో ఆర్చర్ బౌండరీతో ఇంగ్లాండ్ విజయాన్ని ఖాయం చేశాడు. వరుసగా రెండో సూపర్ 8 విజయంతో ఇంగ్లాండ్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా, ఈ ఓటమితో పాకిస్థాన్ టోర్నీలో అవకాశాలు దాదాపు ముగిశాయి. టీ20 ప్రపంచకప్లో వరుసగా ఐదోసారి సెమీఫైనల్కు చేరడం ఇంగ్లాండ్కు విశేషం.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!