
సినిమాలు

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు భారత్ పర్యటన భారీ ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టింది. 2026 జనవరి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ECB టర్నోవర్ రూ.5,266 కోట్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.1,146 కోట్ల పెరుగుదలగా నమోదైంది. భారత్తో జరిగే సిరీస్లు ప్రపంచ క్రికెట్లో ఎంతటి వాణిజ్య ప్రభావం కలిగిస్తాయో మరోసారి స్పష్టమైంది.
అయితే 2027లో ఇంగ్లాండ్ భారత్తో స్వదేశంలో సిరీస్ ఆడకపోవడంతో ECBకి భారీ ఆర్థిక నష్టం ఎదురయ్యే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. భారత్ పాల్గొనే మ్యాచ్లు టీవీ వీక్షణలు, స్పాన్సర్షిప్లు, టికెట్ అమ్మకాలు, గ్లోబల్ క్రేజ్ పరంగా భారీ ఆదాయాన్ని తీసుకువస్తున్నాయి. ప్రపంచ క్రికెట్ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక శక్తిగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!