

ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్ నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు ₹15,280–₹15,300 కోట్లు) అమెరికాకు చెందిన భారత సంతతి వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంతో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలోని 100% వాటాను సోమాని కన్సార్టియం సొంతం చేసుకుంది.
కల్ సోమాని ఇంట్రాఎడ్జ్, అకాడెమియన్, ట్రుయో.ఏఐ వంటి సంస్థల వ్యవస్థాపకుడు. ఆయనకు అమెరికన్ వ్యాపారవేత్త రాబ్ వాల్టన్ (వాల్మార్ట్ కుటుంబం) మరియు డెట్రాయిట్ లయన్స్ NFL జట్టులో మెజారిటీ వాటాలు ఉన్న హాంప్ కుటుంబం నుండి ఆర్థిక మద్దతు ఉంది. ఈ డీల్కు ఫోర్డ్ కుటుంబంతో కూడా సంబంధాలు ఉన్నాయని సమాచారం. కొత్త యాజమాన్యం ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత అధికారికంగా జట్టు బాధ్యతలు చేపట్టనుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది.
ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో శ్రీలంక టీ20 కెప్టెన్ దసున్ శనకను జట్టులోకి తీసుకున్నారు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన సామ్ కరన్, రవీంద్ర జడేజాతో కలిసి రాజస్థాన్ రాయల్స్కు ట్రేడ్ అయ్యారు. వీరి బదులుగా చెన్నై జట్టు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ను తమ జట్టులోకి తీసుకుంది.

.jpg&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!