
సినిమాలు

బీసీసీఐ డగౌట్లో చోటుచేసుకున్న ఫోన్ వివాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్లో మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు గుర్తించారు. అదే సమయంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా ఆ ఫోన్ వైపు చూస్తున్నట్లు కనిపించడం వివాదానికి దారితీసింది.
ఈ ఘటనపై బీసీసీఐ దర్యాప్తు ప్రారంభించిందని తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే మేనేజర్పై భారీ జరిమానా లేదా నిషేధం విధించే అవకాశం ఉంది. అలాగే వైభవ్ సూర్యవంశీకి కూడా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్లో అవినీతి నిరోధక నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!