
జనరల్

భారత్కు చెందిన సౌరవ్ కొఠారి మరోసారి ఐబీఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్నాడు. బుధవారం జరిగిన ఫైనల్లో 41 ఏళ్ల కొఠారి, తన సహచరుడు పంకజ్ అడ్వాణీపై 1133-477 తేడాతో సులభంగా విజయం సాధించాడు.
గత ఏడాది కూడా ఫైనల్లో అడ్వాణీని ఓడించిన కొఠారి, ఈసారి కూడా అదే రీతిలో గెలవడం ప్రత్యేకం. 19 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన అడ్వాణీపై ఈ విజయం కొఠారి ప్రతిభను మరింత స్పష్టంగా చూపించింది. ఈ విజయంతో అంతర్జాతీయ బిలియర్డ్స్లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!