

అభిషేక్ శర్మ ఉదర సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. అయితే పోటీ ప్రపంచకప్లో భాగంగా నమీబియాతో జరగబోయే మ్యాచ్కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పసికూన జట్టుతో మ్యాచ్ కావడంతో టీమ్ మేనేజ్మెంట్ అతడిని రిస్క్ చేయకపోవచ్చని సమాచారం. దీంతో సంజు శాంసన్ ఇషాన్ కిషన్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రపంచకప్కు ముందు న్యూజిలాండ్తో జరిగిన ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో సంజు శాంసన్ వరుసగా 10, 6, 0, 24, 6 పరుగులు మాత్రమే చేసి మొత్తం 46 పరుగులతో నిరాశపరిచాడు. దాంతో తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఫామ్ కోల్పోవడం సహజమే అయినప్పటికీ తిరిగి రాణించడం అత్యంత కీలకం. ఒకవేళ నమీబియాతో మ్యాచ్లో అవకాశం లభిస్తే సంజు తప్పనిసరిగా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. లేనిపక్షంలో అతడి భవిష్యత్ అవకాశాలు సంక్లిష్టమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!