

బిగ్బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 పదో ఎపిసోడ్లో ఫిజికల్ టాస్కులు, టీమ్ ఛాలెంజ్లు, కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. ఎపిసోడ్ ప్రారంభంలోనే ఫైర్ కార్డ్ను ఉపయోగించేందుకు రాజకుమారికి ఇదే చివరి అవకాశమని జ్యూరీ హెచ్చరించింది. దీంతో ఆమె ఫైర్ కార్డ్ను ఉపయోగించి ఓట్ అప్పీల్ అవకాశాన్ని దక్కించుకుంది. మరోవైపు జ్యూరీ మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్గా శ్రష్టిని ఎంపిక చేయడంతో ఆమెకు కూడా ఓట్ అప్పీల్ అవకాశం లభించింది. ఫిజికల్ టాస్క్లో నిబంధనలు ఉల్లంఘించినందుకు రోహిత్కు ఎల్లో కార్డు ఇచ్చారు.
కంటెస్టెంట్లను స్ట్రాంగ్, వీక్ టీమ్లుగా విభజించి ఆర్మ్ రెజ్లింగ్, మ్యూజికల్ చైర్ వంటి టాస్కులు నిర్వహించారు. టాస్కుల్లో గెలిచిన వారు స్ట్రాంగ్ టీమ్లోకి వెళ్లగా, వారు ఎంపిక చేసిన కంటెస్టెంట్లు వీక్ టీమ్లోకి వెళ్లారు. స్ట్రాంగ్ టీమ్లో ఒకరు ఎక్కువగా ఉండటంతో వీక్ టీమ్లోని ఒకరిని డేంజర్ జోన్కు పంపాలని జ్యూరీ సూచించింది. దీంతో గాయత్రిని ఎంపిక చేసి ఎల్లో కార్డు ఇచ్చారు. అనంతరం రెండు టీమ్లకు నాయకులను ఎంపిక చేసే అవకాశం గాయత్రికి ఇవ్వగా, స్ట్రాంగ్ టీమ్కు రోహిత్ను, వీక్ టీమ్కు దీపక్ను లీడర్లుగా ఎంపిక చేసింది.
తర్వాత నిర్వహించిన టాస్క్లో తాళాలు, కీలను ఉపయోగించి తమ టీమ్ సభ్యులను ముందుగా విడిపించే టీమ్ గెలుస్తుందని ప్రకటించారు. రోహిత్ నేతృత్వంలోని స్ట్రాంగ్ టీమ్ ఈ టాస్క్లో విజయం సాధించింది. ఓట్ అప్పీల్ కోసం రోహిత్ శ్రష్టిని ఎంపిక చేయగా, రాజకుమారి తన రివర్స్ ది డిసిషన్ కార్డును ఉపయోగించి శ్రష్టి స్థానంలో తాను ఓట్ అప్పీల్కు వెళ్లింది. మరోవైపు జ్యూరీ మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్గా శ్రష్టిని ఎంపిక చేయడంతో ఆమెకు కూడా ఓట్ అప్పీల్ అవకాశం దక్కింది. తాడును చేతులతో పట్టుకోకూడదనే నిబంధనను పాటించలేదని రోహిత్కు ఎల్లో కార్డు ఇచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!