

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 పదో ఎపిసోడ్లో అసలు ఆట మరింత రసవత్తరంగా మారింది. ఫిజికల్ పవర్తో పాటు స్ట్రాటజీ, టీమ్ గేమ్, డేంజర్ జోన్ టెన్షన్ కంటెస్టెంట్ల మధ్య పోటీని మరింత పెంచాయి. ప్రారంభంలోనే రాజకుమారి తన వద్ద ఉన్న ఫైర్ కార్డును ఉపయోగించి ప్రేక్షకులను ఓట్లు కోరే అవకాశం దక్కించుకుంది. మరోవైపు టాస్కుల్లో అద్భుతంగా రాణించిన శ్రష్టికి జ్యూరీ మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ గుర్తింపు లభించడంతో ఆమెకూ ఓట్ అప్పీల్ చేసే అవకాశం వచ్చింది.
ఆర్మ్ రెజ్లింగ్లో రోహిత్, మిథిలేష్పై విజయం సాధించగా.. అమ్మాయిల విభాగంలో శ్రష్టి, అపూర్వను ఓడించింది. అనంతరం మ్యూజికల్ చైర్స్, తాడు-తాళం వంటి టాస్కులతో కంటెస్టెంట్లను స్ట్రాంగ్, వీక్ టీమ్స్గా విభజించారు. గాయత్రి డేంజర్ జోన్లోకి వెళ్లి ఎల్లో కార్డు అందుకుంది. తాడు-తాళం టాస్క్లో రోహిత్ టీమ్ విజయం సాధించినప్పటికీ, నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో రోహిత్కు మరో ఎల్లో కార్డు పడింది. ఇదే సమయంలో రాజకుమారి ‘రివర్స్ ది డిసిషన్’ కార్డును ఉపయోగించి గేమ్ను మలుపుతిప్పింది. రెండు ఎల్లో కార్డులు, రెండు ఓట్ అప్పీల్ అవకాశాలు, రివర్స్ కార్డ్ ట్విస్ట్తో ఎపిసోడ్ హైడ్రామాతో ముగిసింది. చివరకు బిగ్ బాస్ తెలుగు హౌస్లోకి ఎవరు అడుగుపెడతారన్న ఆసక్తి మరింత పెరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!