

బిగ్బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం, ఈ నెల 6న రాత్రి 7 గంటలకు షో ప్రారంభం కానుంది. ఈ సీజన్లో అగ్నిపరీక్ష నుంచి ఎవరు బిగ్బాస్ ఇంట్లోకి అడుగుపెడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అగ్నిపరీక్షలో 13 మంది కంటెస్టెంట్లు ఉండగా, చరణ్, మిథిలేష్, రోహిత్, ఝాన్సీ, రాజకుమారి, శ్రష్టి వంటి పేర్లు బిగ్బాస్ ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు లీక్స్ వినిపిస్తున్నాయి.
మూడు గ్రీన్స్ సాధించిన మిథిలేష్, చరణ్, రాజకుమారి బిగ్బాస్ ఇంట్లోకి దాదాపు కన్ఫామ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు రోహిత్, ఝాన్సీ, అమన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. శ్రష్టి, షాలినీ కూడా ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉందని టాక్. అయితే అగ్నిపరీక్ష నుంచి ఐదుగురిని లేదా ఆరుగురిని పంపిస్తారా, లేక మొత్తం 10 మందిని పంపిస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
మరోవైపు సీరియల్ హీరోయిన్లు దేబ్జానీ, చైత్రా రాయ్, హీరో ముఖేష్ గౌడ, జబర్దస్త్ నుంచి రామ్ ప్రసాద్, నరేష్, యాంకర్ వర్షిణి, ‘వినాయకుడు’ ఫేమ్ కృష్ణుడు, ఆధాన్ టాక్స్ సుధీర్ రెడ్డి, అదిత్ ఈశ్వరన్, టెంపర్ వంశీ వంటి పేర్లు సెలబ్రిటీ కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. మొత్తం 10 మంది సెలబ్రిటీలు, అగ్నిపరీక్ష నుంచి మరో 10 మందితో కలిపి 20 మంది కంటెస్టెంట్లను తీసుకురానున్నట్లు లీక్స్ చెబుతున్నాయి. ఇప్పటికే సెలబ్రిటీల ఏవీలు, డ్యాన్స్ పర్ఫామెన్స్లు, నాగార్జున హోం టూర్ షూట్ పూర్తయినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!