

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నేడు భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు, అడ్డంకులను అధిగమించి నిర్వహించిన రిలే దీక్షలు విజయవంతమయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. రిలే దీక్షల్లో యువత, ముఖ్యంగా జెన్-జీ పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు.
డీఎస్సీ వ్యవహారంలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరింది. ర్యాలీలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పార్టీ ఆరోపించింది. డీఎస్సీ అంశంపై యువత, ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని, తమ ఆందోళనలను మరింత విస్తృతం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!