
సినిమాలు

క్రాంతికుమార్ ఆత్మహత్య, గాదె సాయికృష్ణ అదృశ్యం కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఛైర్మన్ను కలిశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజు వేధింపుల కారణంగా క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నారని, అలాగే గాదె సాయికృష్ణ లాకప్ డెత్కు గురయ్యాడనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దిల తనూజరాణి, డాక్టర్ గురుమూర్తి ఈ రెండు ఘటనలను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించాలని ఎన్హెచ్ఆర్సీని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, వాస్తవాలను వెలికితీసే స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!