

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్, ఆయన సతీమణి శ్రీమతి వైఎస్ భారతి హాజరయ్యారు. సాంప్రదాయ పంచెకట్టు, భుజంపై కండువాతో శ్రీ వైఎస్ జగన్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన జగన్ దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఇతర నాయకులు జగన్ దంపతులను ఆహ్వానించారు. ఉగాది సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేసి, పూజా మందిరంలా అలంకరించారు.
శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి పంచాంగాన్ని వినిపించారు. పంచాంగ శ్రవణం తర్వాత వేద పండితులు జగన్ దంపతులకు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలు ఇచ్చారు. పంచాంగ శ్రవణం అనంతరం శ్రీ వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు.
అనంతరం పంచాంగం చదివిన పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రితో పాటు వేద పండితులను శ్రీ వైఎస్ జగన్ సన్మానించారు.






.jpg&w=3840&q=75)








.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!