

తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఏటీఏ) మహాసభల్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ పర్యాటక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశాల్లోని తమ మిత్రులు, సహోద్యోగులను తెలంగాణకు తీసుకువచ్చి రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో నిలబెడుతున్న ప్రవాస భారతీయులను మంత్రి అభినందించారు. హైదరాబాద్లో రూ.10 కోట్ల వ్యయంతో ఎన్ఆర్ఐ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే ప్రజలు ప్రభుత్వ విద్య, వైద్య సేవలను వినియోగించుకోవాలని, ఆర్భాట ఖర్చులను తగ్గించాలని సూచించారు. యువతలో వ్యసనాల నిర్మూలన కోసం త్వరలో ‘ప్రభాత భేరి’ సామాజిక చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!