

తన ప్రత్యేక శైలిలో మాట్లాడే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈరోజు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ హాజరైన సమావేశంలో మరోసారి తన డిప్లొమాటిక్ పద్ధతిని ప్రదర్శించారు. అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ “అన్నయ్యలా” ఉంటారని పేర్కొంటూ, కేంద్రం నుంచి తెలంగాణకు మరింత సహకారం అందించాలని రేవంత్ నిజాయితీతో కూడిన అభ్యర్థన చేశారు. గతంలో మోదీ కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారన్న విషయాన్ని గుర్తుచేసిన రేవంత్, రాష్ట్ర ప్రగతికి కేంద్రం సహాయం ఎంత కీలకమో ఆయనకు బాగా తెలుసని పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణ, ముసి నది అందీకరణ, తాగునీటి వ్యవస్థ అభివృద్ధి వంటి అంశాల్లో కేంద్రం సహకారం అత్యంత అవసరమని రేవంత్ వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి మనోహర్ లాల్, హైదరాబాద్ మెట్రోపై కేంద్రం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతున్న రేవంత్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి రేవంత్ తన విధానంతో కేంద్రం నుండి అనుకూల ఫలితాలను తెచ్చుకునే దిశగా అడుగులు వేసినట్లు కనిపిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!