

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే విడుదలకు ముందే భారీ సంచలనం సృష్టిస్తోంది. భారతదేశంలో ఈ సిరీస్కు ఎప్పటి నుంచో విశేష ఆదరణ ఉండగా, ఈసారి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాల్లోని ప్రముఖ మల్టీప్లెక్స్లలో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. ప్రత్యేక ప్రీమియర్ షోలకూ భారీ డిమాండ్ ఉండటంతో ఓపెనింగ్ కలెక్షన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ చిత్రం భారతదేశంలో తొలి రోజే రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
మరోవైపు ఈ హాలీవుడ్ చిత్రం ప్రభావం ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న తెలుగు సినిమాలపై ఎలా ఉంటుందనే చర్చ సినీ వర్గాల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, యువత నుంచి మంచి ఆదరణ పొందుతున్న చెన్నై లవ్ స్టోరీ వంటి చిత్రాల వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకుల దృష్టి స్పైడర్ మ్యాన్ వైపు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న సినిమాల ఆక్యుపెన్సీపై ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. విడుదల అనంతరం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో, ఇతర చిత్రాలపై ఎంత మేర ప్రభావం చూపుతుందో స్పష్టత రానుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!