
జనరల్

నరేంద్ర మోదీ నీట్ పేపర్ లీక్ అంశంపై స్పందిస్తూ, ఇది అత్యంత తీవ్రమైన విషయం అని పేర్కొన్నారు. ఇందులో ఎవ్వరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విషయం తెలిసిన వెంటనే కేసును సీబీఐ కు అప్పగించామని, నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపామని తెలిపారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండేందుకు వెంటనే రీ ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు విడుదల చేసినట్లు చెప్పారు.
దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించానని ప్రధాని తెలిపారు. ఈ అంశంపై రాబోయే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!