

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఉప ఫ్లోర్ లీడర్ టి. హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అసలు విద్యావేత్తలు లేని కమిటీని ఏర్పాటు చేసి, కొత్త విద్యా విధానంపై నివేదిక సిద్ధం చేయించడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కూల్, కళాశాల లేదా విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనా అనుభవం ఉన్న నిపుణులు లేకుండా విద్యా విధానం రూపకల్పన చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యా కమిషన్లో విద్యాశాఖపై ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారు, సిలబస్ రూపకల్పనలో అనుభవం కలిగిన నిపుణులు, బాల మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఉండాల్సిన అవసరం ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. అర్హతలేని వారితో కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతున్నారని ఆయన ఆరోపించారు. విద్యావ్యవస్థను దెబ్బతీసే నిర్ణయాలను నిలిపివేసి, తక్షణమే అసలైన విద్యావేత్తలకు బాధ్యతలు అప్పగించాలని ఆయన కోరారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!