

జీహెచ్ఎంసీ కోర్ అర్బన్ రీజియన్ సమీకృత పాలనా బిల్లు (క్యూర్ బిల్లు)పై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని జనసేన పార్టీ కోరింది. ఈ బిల్లు స్థానిక సంస్థల అధికారాలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, పన్నులు, పౌర సేవలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా బిల్లుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విడుదల చేయాలని సూచించింది.
హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి జనసేన ముఖ్య లక్ష్యమని పేర్కొన్న పార్టీ, నగర పాలనను మెరుగుపరిచే సంస్కరణలకు తాము సానుకూలమని తెలిపింది. అయితే కొత్త చట్టాలు తీసుకురావడం మాత్రమే అభివృద్ధికి సరిపోదని, ప్రజల హక్కులకు భంగం కలగకుండా ప్రతి నిబంధనపై ప్రజలతో చర్చించి స్పష్టత ఇవ్వాలని కోరింది. ప్రజల భాగస్వామ్యం, పారదర్శక పాలన, జవాబుదారీతనం, అవినీతి రహిత వ్యవస్థ ద్వారానే నిజమైన నగరాభివృద్ధి సాధ్యమవుతుందని జనసేన అభిప్రాయపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!